Thursday, June 23, 2011

తెలుగు కవితలు

అందంకోసం ఆరాట పడ్డాయి  కొన్ని అక్షరాలు ,

అలుపెరగక తిరిగాయి అందిన అన్నిలోకాలు ,

అలసట మరిచాయి తమ ఆశ తీరేవరకు ,

ఆంధ్ర దేశాన్ని  చేరాయి కలను నిజము చేసుకొనుటకు ,

అందమైనది తెలుగు భాషనీ తెలుసుకున్నాయి   చివరకు, 

అ అంటూ ఆ నేనంటూ  ఒక్కొకటి మారాయి  తెలుగే భువిలో అందమంటూ ,

ఆనందంతో మారిపోయాయి  పదాలుగా స్వరాలుగా  తమ ఆశ తీరేటట్టు,

ఆస్వాదిస్తూ మారిపోయాయి  మన ఈ కవితలుగా  చిరకాలం నిలిచిపోవాలంటూ,

అందుకే వుంటాయి మన  తెలుగు కవితలు  ఈ జగతికి వన్నెతెచేటట్టు.

                                                                       శిరిష్ శరత్

No comments:

Post a Comment